The Guardian: పాక్‌ ఉగ్రవాదులు, ఖలిస్థానీల హత్యకు భారత్‌ ఆదేశాలు.

ది గార్డియన్‌ సంచలన కథనం;

Update: 2024-04-06 02:30 GMT

విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్‌ పత్రిక ది గార్డియన్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకున్నదని పేర్కొన్నది. కెనడాలో సిక్కు వేర్పాటువాదుల హత్యలపై ఆ దేశ ప్రధానితో పాటు అమెరికాలో కూడా భారత్‌పై బహిరంగంగానే విమర్శలు వచ్చాయని పేర్కొన్నది. 2020 నుంచి పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని వివరించింది. కాగా, దిగార్డియన్‌ కథనాన్ని భారత్‌ కొట్టివేసింది. ఇవి నిరాధార ఆరోపణలని పేర్కొన్నది.

Tags:    

Similar News