Nara Lokesh: ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేశ్
తండ్రికి పాదాభివందనం చేసి..;
చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వెంటనే నారా లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడు లోకష్ ప్రమాణం సందర్భంలో చంద్రబాబు కళ్ళలో ఆనందం కనిపించింది.