ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్లా జగన్ పాలన కొనసాగిస్తున్నారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఎడిటర్లతో జరిగిన ముఖాముఖిలో ప్రశాంత్ కిశోర్ మరోసారి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్లా తాయిలాలివ్వడం తప్ప.. ప్రజల ఆకాంక్షలను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. నగదు బదిలీ మాత్రమే చేశారని.. ఉద్యోగాల కల్పనపైన, అభివృద్ధిపైన ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఓడిపోయిందని...జగన్ విషయంలోనూ అదే జరగనుందని అభిప్రాయపడ్డారు.