Kolikapudi Srinivasa Rao: హైదరాబాద్‌ నుంచి అమరావతికి పాదయాత్ర

Update: 2023-07-17 07:30 GMT

ఏపీ రాజధాని అమరావతి కోసం అలుపెరగని పోరాటం జరుగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టారు.టీడీపీ నేత కేశినేని చిన్ని పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.వనస్థలిపురం ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలని ఆర్‌5 జోన్‌ రద్దుచేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. 

Tags:    

Similar News