తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు సిద్దం చేసుకున్నా రైతులు ఖరీప్ సాగుకు సన్నద్దమయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పనులు ముందుకు సాగట్లేదు. సలహాలు, సూచనలు అందించాల్సిన వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.