Hyderabad: వరద ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి

Update: 2023-07-28 07:56 GMT

హైదరాబాద్‌ వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరి సర్కిల్‌లో పొంగిపొర్లుతున్న నాలాల్ని పరిశీలించారు. పొంగుతున్న నాలాలతో బస్తీల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సమస్యను పరిష్కరించాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. సమస్య తీవ్రతను వివరించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. 

Tags:    

Similar News