టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాయలసీమ పర్యటన ఖరారైంది.ఆగస్టు 1 నుంచి సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈనేపధ్యంలో చంద్రబాబు పర్యటన వివరాలు తెలిపారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు.3న గండికోట రిజర్వాయర్ పరిశీలన,ఆగస్టు 4న కళ్యాణదుర్గంలో బైరవాని తిప్ప ప్రాజెక్ట్,పేరూర్లోని ఇతర ప్రాజెక్టులను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు.రాయలసీమ భవిష్యత్తో జగన్ ఆటలాడుకుంటున్నారని,కరువు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్ట్లను.ఆపేశారని మండిపడ్డారు కాల్వ శ్రీనివాసులు.