వైసీపీ సర్కార్పై టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫైరయ్యారు. జగన్ సర్కార్ పేదలకు విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను అమ్మకానికి పెట్టారని విమర్శలు గుప్పించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ సర్కార్ స్కామ్ల మయంగా మారిందన్నారు. వైసీపీ నేతలు జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.