సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లెలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను హిందూపురం ఆస్పత్రిలో ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సవితమ్మ, నాయకులు వడ్డే వెంకట్ పరామర్శించారు. వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సవితమ్మ తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచక పాలన కొనసాగుతుంటే జగన్ ఏం చేస్తున్నట్లు అని విరుచుకుపడ్డారు. గ్రామంలోకి వాహనాల్లో వచ్చి మారణాధాయులతో దాడి చేసి గాయపరుస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆమె తెలిపారు.