గుంటూరు కార్పొరేషన్ ముందు టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మేయర్ కావటి మనోహర్నాయుడు వాహనాన్ని టీడీపీ నేతలు అడ్డగించారు. మంచినీటి సరఫరా చేయడంలో కార్పొరేషన్ విఫలమైందంటూ మేయర్ కారు ఎదుట కుండలను పగలగొట్టి నిరసన తెలిపారు. తాగునీరు ఇవ్వడం చేతకాని కమిషనర్ అంటూ విమర్శలు గుప్పించారు.