ఆంధ్రప్రదేశ్కి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ నాన్స్టాప్గా వానలు దంచుతున్నాయి. మరోవైపు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. దాంతో, ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. విశాఖ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వానలు బెంబేలెత్తిస్తున్నాయి.