యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది.మంత్రి పర్యటన నేపధ్యంలో తనకు సమాచారం ఇవ్వలేదని జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పోడుభూముల పట్టాల పంపిణీ చేశారు, అయితే తనకు సమాచారం లేదని అన్నారు. గతంలో కూడా అధికారులు ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు.