JYOTHI YARRAJI: రెప్పపాటులో గోల్డ్ కొట్టిన జ్యోతి యర్రాజీ
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్–2025లో స్వర్ణం;
తెలుగు అథ్లెట్ జ్యోతి యర్రాజీ అంతర్జాతీయ పోటీలో మరోసారి భారత్ గౌరవాన్ని పెంచింది. అంతర్జాతీయ వేదికపై తెలుగమ్మాయి, భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవలే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన జ్యోతి తాజాగా తైవాన్ ఓపెన్ అథ్లెటక్స్లోనూ అదరగొట్టింది. రు. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్–2025లో ఆమె మహిళల 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో బంగారు పతకం గెలిచింది. 12.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. జ్యోతి ఆరంభంలో కాస్త వెనుకబడింది. ఫైనల్ హార్డిల్స్కు ముందు ఆమె టాప్-2లో కూడా లేదు. కానీ, చివరి సెకన్లలో మెరుపు వేగంతో దూసుకొచ్చి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇదే ఈవెంట్లో పురుషుల 110 మీటర్ల హార్డిల్స్ విభాగంలో భారత అథ్లెట్ తేజస్ శీర్సే సైతం స్వర్ణం సాధించి దేశాన్ని గర్వపడేలా చేశారు.
మంచి ఫామ్లో ఉన్న జ్యోతీ...
జపనీస్ రన్నరప్ అసుక తెరాడే (13.4) సెకండ్లు. కిస్ ఆటో కియో (13.10) సెకండ్ల తేడాతో సిల్వర్, బ్రాంజ్ సంపాదించుకున్నారు. ఇక తైవాన్ ఓపెన్ 2025 వేడుకలు తైపీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. జ్యోతి యర్రాజీ కొరియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో కూడా గోల్డ్ మెడల్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె (12.96) సెకండ్లలో గోల్డ్ మెడల్ కొట్టేసి సత్తా చూపించింది.జ్యోతి యర్రాజీ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అథ్లెట్. మన దేశానికే గర్వకారణంగా నిలిచింది. జ్యోతి 2000 సంవత్సరంలో నవంబర్ 28న ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించింది. చిన్నతనం నుంచే క్రీడల్లో ఆసక్తి కనబరిచింది. స్కూల్లో ఉన్నప్పుడు నుంచి ఆమె పరుగు ప్రారంభించింది. ఇక చదువుకుంటూనే తన క్రీడా కెరీర్ ప్రారంభించింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో ప్రావీణ్యత పొందింది. ఇదే ఏడాది సౌత్ కొరియా వేదికగా జరిగిన ఆసియా అథ్లెటెక్స్ ఛాంపియన్షిప్లో జ్యోతి ( 12.96) సెకండ్లలో గోల్డ్ కొట్టేసింది. కేరళలో కూడా తన సత్తా చూపించింది మరో బంగారు పతకం సాధించింది.