IPL 2024 : టీ20ల్లో చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్

Update: 2024-04-29 06:49 GMT

టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు 200కుపైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ జట్టు 35 సార్లు 200కుపైగా స్కోర్ సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఈ ఫీట్ నెలకొల్పింది. ఆ తర్వాతి స్థానాల్లో సోమర్‌సెట్ (34), ఇండియా (32), ఆర్సీబీ (31), యార్క్‌షైర్ (29), సర్రే (28) ఉన్నాయి.

అటు ఐపీఎల్ లో మిస్టర్ కూల్ ధోనీ అరుదైన ఘనత అందుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాడిగా నిలిచారు. నిన్న సన్ రైజర్స్ తో మ్యాచులో విజయం ధోనీకి 150వది కావడం గమనార్హం. మరే ఆటగాడు కూడా ఈ ఘనత అందుకోలేదు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(133), జడేజా(133) ఉన్నారు.

చెన్నై ప్లేయర్ డారిల్ మిచెల్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఒకే మ్యాచులో అత్యధిక క్యాచులు పట్టిన ప్లేయర్‌గా నబి(5) రికార్డును సమం చేశారు.సన్ రైజర్స్ తో మ్యాచులో మిచెల్ ఐదు క్యాచులు అందుకున్నారు. అంతకుముందు 2021లో ముంబైతో జరిగిన మ్యాచులో నబి ఈ ఘనత సాధించారు. మరోవైపు ఒకే ఇన్నింగ్స్‌లో సన్ రైజర్స్ 9 మంది బ్యాటర్లు క్యాచ్ అవుట్ అవ్వడం ఇది మూడో సారి.

Tags:    

Similar News