Ind vs Eng : 477 పరుగులకు టీమిండియా టీమిండియా ఆలౌట్

Update: 2024-03-09 05:53 GMT

భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌ మిగితా రెండు వికెట్లు కోల్పోయింది.దీంతో 477 పరుగులకు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత్ 259 పరుగులు ఆధిక్యంలో ఉంది. రోహిత్ (103), గిల్ (110), యశస్వి జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56), దేవదుత్ పడిక్కల్ (65) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్‌ 700 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 123.4 ఓవర్‌ వద్ద అండర్సన్‌ వేసిన బంతికి కీపర్‌ చేతికి చిక్కి కుల్‌దీప్‌ యాదవ్‌ (30) ఔటయ్యాడు.

Tags:    

Similar News