IND vs SL: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. రెండో టీ20కి అంతా రెడీ..
India vs Srilanka: శ్రీలంక టూర్లోని భారత్ జట్టుకి గొప్ప ఉపశమనం ఇచ్చే వార్త.;
India vs Srilanka: శ్రీలంక టూర్లోని భారత్ జట్టుకి గొప్ప ఉపశమనం ఇచ్చే వార్త. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా మంగళవారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్కి కొన్ని గంటల ముందు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో.. మ్యాచ్ని బుధవారం రాత్రికి శ్రీలంక బోర్డు వాయిదా వేసింది. కానీ.. ఈరోజు రాత్రి 8 గంటలకి జరిగే రెండో టీ20కి భారత్ కనీసం 5-6 మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్గా తేలగానే అతడ్ని ఐసోలేషన్కి తరలించిన అధికారులు.. గత రెండు రోజులుగా అతనితో 8 మంది క్లోజ్గా మెలిగినట్లు గుర్తించారు. దాంతో.. వారిని కూడా ఐసోలేషన్లో ఉండమని ఆదేశించి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. అయితే.. ఆ 8 మందికి కూడా కరోనా నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు రెండో టీ20కి వీరిని ఆడించకూడదని నిర్ణయించారట. దాంతో.. ఈరోజు జట్టు కొత్తగా ఉండబోతోంది.
వాస్తవానికి శ్రీలంక టూర్కి జంబో జట్టునే భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. 20 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్ బై నెట్ బౌలర్లు కూడా ప్రస్తుతం అక్కడ టీమ్తో ఉన్నారు. దాంతో.. కృనాల్ పాండ్యాతో పాటు 8 మంది టీమ్కి దూరమైనా.. మ్యాచ్ ఆడగలిగే టీమ్ అక్కడ ఉంది. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఆ 8 మంది పేర్లని మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ గోప్యంగా ఉంచుతోంది. కానీ.. ఎక్కువ మంది ఆటగాళ్లే ఉన్నారని మాత్రం తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం గురువారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.