భారత క్రికెటర్ మహ్మద్ షమీకి (Mohammed Shami) మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. స్పోర్ట్స్టార్ అవార్డ్స్ అందించే స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందించారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు.
ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షమీ గతేడాది అత్యుత్తమంగా రాణించాడు. 2023 వన్డే ప్రపంచకప్లో షమీ 24 స్కాల్ప్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 57 పరుగులకు 7 వికెట్ల నష్టానికి ఫాస్ట్ బౌలర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
కాగా చెస్ ఎక్స్పోనెంట్ ఆర్ వైశాలి 'స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గెలుచుకుంది. భారత పురుషుల క్రికెట్ జట్టు గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శనతో 'నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర క్రికెట్ (Saurashtra Cricket) జట్టు సంవత్సరపు ఉత్తమ క్లబ్/రాష్ట్ర జట్టుగా అవార్డు పొందింది.