nawab: నవాబ్ ఆఫ్ క్రికెట్.. టైగర్ పటౌడీ
క్రికెట్ చరిత్రలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం;
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అలియాస్ టైగర్ పటౌడీ ఈ పేరుకు భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండ బ్రిటిష్ క్రికెట్ చరిత్రలోను ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల ఆయన పేరు మీదున్న 'పటౌడీ ట్రోఫీ'ని అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే, మొదట పటౌడీ ట్రోఫీకి ఆ పేరును సజెస్ట్ చేసింది ఇండియా కాదు ఇంగ్లాండ్. భారత్లో అతడికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించి ఇంగ్లాండ్లో ఫ్యాన్స్ ఉన్నారు. అతడు కేవలం ఒక అసాధారమైన ప్లేయర్ మాత్రమే కాదు గ్రేట్ పర్సనాలిటీ.
దిగ్గజ ఆటగాడి మార్గనిర్దేశం...
పటౌడీ 1961-75 మధ్య కాలంలో భారత్ తరుపున 46 టెస్టులు ఆడి 2,793 పరుగులు (6 సెంచరీలు) చేశాడు. 21 ఏళ్ల వయసులోనే టెస్టు టీంకి కెప్టెన్గా మారి సంచలనం సృష్టించాడు. అయితే, అతన్ని గ్రేట్ పర్సనాలిటీగా నిలిపిన అంశాలు వేరు. యాక్సిడెంట్లో కుడి కన్ను పోయినప్పటికీ అతడు కవర్స్లో చిరుత లాంటి వేగంతో ఫీల్డింగ్ చేసే వాడు. టైగర్ టీమ్లో 'భారతీయత' తెచ్చాడు. ఉత్తర, దక్షిణ అనే భావాలను సమూలంగా తొలిగించాడు. భారత జట్టుకు విదేశాల్లో తొలి విక్టరీని అందించాడు. ఈ విజయం భారత క్రికెట్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయన దూకుడు మనస్తత్వం, స్టైలిష్ బ్యాటింగ్, గెలుపు కోసం మొండి వైఖరి టీమిండియాను అత్యుత్తమ జట్టుగా మార్చాయి.
ఇంగ్లాండ్లోను నవాబే
టైగర్ ఇంగ్లాండ్లోని వించెస్టర్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదివాడు. సస్సెక్స్ కౌంటీ టీమ్కి ఆడాడు, ఆక్స్ఫర్డ్ క్రికెట్ టీమ్కి కెప్టెన్. అతడు తన సొగసు, ఆటతో ఇంగ్లాండ్లో అనేక మందికి రోల్ మోడల్గా మారాడు. అతడి ఇంగ్లీష్ యాస, రాయల్ వైబ్, గ్రేట్ కామెడీ టైమింగ్ బ్రిటిష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికి అనేకమంది ఇంగ్లాండ్ ప్లేయర్లు అతడిని హీరోలా ట్రీట్ చేస్తారు. టైగర్'పటౌడి 1961 -1975 మధ్యకాలంలో మొత్తం 46 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 40 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు. వాటిలో 6సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించారు. ఒక డబుల్ సెంచరీ కూడా ఆయన పేరు మీద ఉంది.
పటౌడీ ట్రోఫీ
2007లో భారత క్రికెట్ టీం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు పటౌడీ ట్రోఫీ అని నామకరణం చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే, మన్సూర్ అలీ ఖాన్ తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్ టీంకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఇద్దరి గౌరవార్థం ఇంగ్లాండ్ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్రోఫీ నుంచి పటౌడీ పేరును మెడల్స్కు మార్చారు. అతడు పటౌడీ రాజా వంశానికి చెందినవాడని చాలా మందికి తెలిసిన విషయమే. అతడి భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో దిగ్గజ నటులుగా ఎదిగారు.