Tokyo Olympics: సెమీఫైనల్ చేరిన పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ మహిళల క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ మహిళల క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. 21 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 56 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింధు నెగ్గింది. దీనితో సెమీ ఫైనల్ కి దూసుకెళ్లింది. కాగా 2016 ఒలింపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.