Sakshi Dhoni: జార్ఖండ్‌ ప్రభుత్వంపై క్రికెటర్ భార్య ఫైర్..

Sakshi Dhoni: జార్ఖండ్‌లో తనకు కలుగుతున్న ఇబ్బందిని ఓపెన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది క్రికెటర్ భార్య.

Update: 2022-04-27 04:30 GMT

Sakshi Dhoni: చాలామంది సెలబ్రిటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా కాంట్రవర్సీగా మారుతుంది అని భావిస్తారు. అయితే ఈ క్రికెటర్ భార్య మాత్రం అలా ఆలోచించలేదు. జార్ఖండ్‌లో తనకు కలుగుతున్న ఇబ్బందిని ఓపెన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో తాను ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడింది.

ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఎమ్ ఎస్ ధోనీ. కెప్టెన్‌గా టీమిండియాను ముందుండి నడిపించి ఎన్నో విజయాలను అందించాడు. అయితే ధోనీ భార్య సాక్షి.. తన ఆటల సమయంలో స్టేడియంకు రావడంతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. సాక్షి ధోనీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు వారి పర్సనల్ విషయాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటుంది.


తాజాగా జార్ఖండ్‌లోని కరెంటు సమస్యల గురించి సాక్షి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'ఒక ట్యాక్స్ పేయర్‌గా జార్ఖండ్‌లో ఇన్నేళ్ల నుండి పవర్ కట్ ఎందుకు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మేము మా వరకు కరెంటును ఆదా చేస్తూనే ఉన్నాము' అని సాక్షి ట్వీట్ చేసింది. ఈ విషయంపై పలువురు పాజిటివ్‌గా స్పందిస్తూ సాక్షికి సపోర్ట్ చేశారు.


Tags:    

Similar News