ఆ ఇద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు: వీరేంద్ర సెహ్వాగ్
IND vs ENG 2వ టెస్టు 2024లో వారి ఆట తీరుని చూసి సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముచ్చట పడుతున్నారు.
IND vs ENG 2వ టెస్టు 2024లో వారి ఆట తీరుని చూసి సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముచ్చట పడుతున్నారు. ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శనతో యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్లు క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. భవిష్యత్తులో వీరిరువురు భారత క్రికెట్ జట్టుకు కీలకంగా మారనున్నారు అని వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించారు.
యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ ఇద్దరూ ఇంగ్లండ్లో తమ అద్భుతమైన ప్రదర్శన ద్వారా తమ సామర్థ్యాన్ని చూపించారు. విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ లు బ్యాట్తో రాణించి క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగుర వేశారు.
రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ సెంచరీ చేసి భారత్ను అదుపులో ఉంచాడు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు ఆటగాళ్ల ప్రయత్నాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ఇద్దరు క్రికెటర్ల వయస్సు 25 కంటే తక్కువ. ఈ ఇద్దరు క్రికెటర్లు రాబోయే దశాబ్దం పాటు ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించగలరని వీరేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.