ఉప్పల్ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ల మధ్య కీలక మ్యాచ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ నిర్వహణపై ఫ్యాన్స్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా హెచ్సీఏ ఉప్పల్ మ్యాచ్పై కీలక అప్ డేట్ ఇచ్చింది.
మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 గంటల వరకు సమయం ఉన్నట్లు పేర్కొంది. వర్షం నీళ్లను పూర్తిగా డ్రెయిన్ అవుట్ చేసి గ్రౌండ్ను సిద్ధం చేసేందుకు వంద మందికి పైగా గ్రౌండ్ మెన్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హెచ్సీఏ సిబ్బంది, ఫ్యాన్స్ నిరుత్సాహ పడవద్దని హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు తెలిపారు.