తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్ అన్నారు. కర్నాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ప్రజాస్వామికంగా అందరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని.. ఇది రాజకీయ ఎత్తుగడ కాదన్నారు. కాంగ్రెస్ను వదిలి వేరే పార్టీకి వెళ్లిన వారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని... అందుకే సొంతగూటికి రమ్మని పిలిచారని చెప్పారు. ఇక కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే వరుస మీటింగ్లు పెడుతున్నారని అద్దంకి దయాకర్ అన్నారు.