జూన్ 9న గ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు పంపిణీ
సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ అయ్యారు;
జూన్ 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు పంపిణీ చేయనున్నారు బత్తిన సోదరులు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ అయ్యారు. చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్. అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.