తెలంగాణ పోలీస్ శాఖలో సస్పెన్షన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ మరో 10 మంది టీజీఎస్పీలను డిస్మిస్ చేసింది. దాంతో వేటుకు గురైన వారి సంఖ్య 49కి చేరింది. మరోవైపు హైదరాబాద్లో సభలు, సమావేశాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. దీంతో వేటుకు గురైన కానిస్టేబుళ్లు ధర్నాలు, ర్యాలీలపై గందరగోళంలో పడ్డారు.