తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు.. 38 మంది మృతి..!

తెలంగాణలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Update: 2021-04-25 05:00 GMT

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8 వేల 126 కేసులు.. 38 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 95వేల 232కి చేరింది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1999కు పెరిగాయి. ప్రస్తుతం 62 వేల 929 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1259, మేడ్చల్ జిల్లా 676, నిజామాబాద్ జిల్లా 497, రంగారెడ్డి 591, మహబూబ్ నగర్ 306, మంచిర్యాల జిల్లా 233, సిద్దిపేట 306, కరీంనగర్ 286, ఖమ్మం 339, జగిత్యాల జిల్లాలో 264 కరోనా కేసులు వచ్చాయి.

Tags:    

Similar News