Gadwal Murder Case : గద్వాల నవ వరుడి హత్య కేసులో 8 మంది అరెస్ట్

Update: 2025-06-28 08:15 GMT

తెలంగాణ, ఆంధ్రలో సంచలనం సృష్టించిన నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో ఎనిమిది మందిని జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమలరావుతో కలిసి తేజేశ్వరు సుఫారీ గ్యాంగ్ మర్డర్ చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఎంగేజ్మెంట్ నుంచే ఈ హత్యకు కుట్ర పన్నారు. ఇందుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

గద్వాల జిల్లా కేంద్రం గంటగిరికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్ కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయ మైంది. కర్నూలుకు చెందిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావు తల్లీ, కుమార్తెలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు వివాహం వద్దని అభ్యంతరం చెప్పారు. అయితే ఐశ్వర్య చెప్పిన మాయ మాటలకు తేజేశ్వర్ నమ్మి మే 17న బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్యకు వివాహం జరగడంతో జీర్ణించుకోలేని బ్యాంకు మేనేజర్ తిరుమలరావు, సర్వేయర్ తేజేశ్వరు హత్యచేసేందుకు పథకం వేశాడు. అయితే దీంతో అతను తేజేశ్వర్ను చంపేందుకు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే స్కేచ్ వేశాడని, తేజేశ్వర్ను ఎలాగే హతమారిస్తే భర్త చనిపోయి ఒంటరి అయిన ఐశ్వర్యతో తన వివాహేతర సంబంధం కొనసాగించవచ్చని తిరుమల రావు ప్లాన్ వేసుకున్నాడు. లడక్ ట్రిప్ ప్లాన్ కు వెళ్లక ముందు నుంచి తిరుమలరావుతో ఐశ్వర్యకు సన్నిహిత్యం ఉండటంతో ఇద్దరు.. తరచూ వీడియోకాల్ మాట్లాడుకునేవారని, తేజేశ్వర్ ను హతమార్చిన తర్వత లడక్ ట్రిప్ వెళ్లేందుకు ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. అక్కడ నుంచి విదేశాలు కూడా వెళ్లిపోవాలన్న ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ హతమార్చేందు కు తన వద్దకు బ్యాంక్ రుణం కోసం వచ్చిన వ్యక్తులతో ఆయన డీల్ మట్లాడుకున్నాడన్నారు.

అనంతరం అతనిపై అటాక్ చేసేందుకు సుపారీ గ్యాంగ్ ప్రయత్నించినప్పటికీ కుదరక పోవడంతో పొలం సర్వే చేయాలని తేజేశ్వరు ఓ కారులో తీసుకు వెళ్లి, కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను వెనక సీట్లో కూర్చున్న వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారని వెల్లడించారు. జూన్ 17న బ్యాంకు మేనేజర్ తిరుమల రావు సుఫారి గ్యాంగ్ తో సర్వేయర్ తేజేశ్వర్ను కిడ్నాప్ చేసి హత్య ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఒక హత్యకు గురైనట్లు తెలియడంతో అప్పటి నుంచి గద్వాల కాలువ దగ్గర పారవేయడం జరిగింది. జూన్ 22న తేజేశ్వర్ పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన ఎస్సై సీసీ కెమేరాల ఆధారంగా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.

ఈ కేసు సంబంధించి ఎ1గా వి. తిరుమల రావు, ఎ2గా ఐశ్వర్య, ఎలిగా కుమ్మరి నాగేష్, ఎ4-చాకలి పరశురాముడు, ఎత్ గా చాకలి రాజు, ఎ6గా ఏ.మోహన్, ఎ7గా తిరుపతయ్య, ఎరిగా సుజాత నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుల నుండి కారు, కొడవల్లు-2, కత్తి, 10-మొబైల్ లు, రూ.లక్ష ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి రిమాండు తరలించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడంలో ప్రతిభ చూపిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ క ుమార్, రూరల్ ఎస్సై శ్రీకాంత్, ధరూర్ ఎస్సై కొండా శ్రీ హరి, మల్దకల్ ఎస్సై నందికర్, గట్టు ఎస్సై మల్లేష్, ఐటి సెల్ ఎస్సై సుకూర్, పి.ఎస్సైలు స్వాతి, తేజేశ్విని, సిబ్బందిని క్యాష్ వా ఎస్పీ అభినందించారు.

---

Tags:    

Similar News