హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అర్హత లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీనిధి, గురునానక్ యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయాలు పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి.. వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.