తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కొంత గ్యాప్ తర్వాత హైడ్రా అలజడి మళ్లీ మొదలైంది. రంగారెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ మదుబన్ కాలనీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమించి ఏర్పాటు చేసిన డబ్బాలను నేలమట్టం చేశారు. నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో.. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగి, 200 డబ్బాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది. నిరసనల కారణంగా బందోబస్తు మధ్య కూల్చివేతలు చేస్తున్నారు.