డీవోపీటీ ఉత్తర్వులతో నాలుగు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధుల్లో చేరిన మహిళా ఐఏఎస్ ఆమ్రపాలి తనను తెలంగాణకే కేటాయించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలి తెలంగాణలో రిపోర్ట్ చేశాక ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.