కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి సవాల్

Update: 2020-12-15 13:21 GMT

నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఆయన ఒంగోలులో చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కొత్త వ్యవసాయ చట్టాలకు వక్రభాష్యం చెప్తూ.. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆ రెండు పార్టీలూ తమతో చర్చలకు వచ్చేందుకు సిద్ధమా అంటూ ఆంజనేయరెడ్డి సవాలు విసిరారు.


Tags:    

Similar News