జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. విజయమ్మను ఏడిపించిన బొత్స లాంటి వారు కేబినెట్లో ఉన్నారన్నారు. తండ్రిని చంపింది అంబానీ అన్న జగన్.. ఆ తర్వాత ఆయనకు రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. జగన్ పాలన మొత్తం డబ్బుల మయంగా మారిందని... సజ్జల ఒక బ్రోకర్ అంటూ మండిపడ్డారు. బాలినేనికి తనను అడిగి హక్కు లేదన్నారు. చంద్రబాబు, పవన్ కలిస్తే 150 సీట్లు దాటుతాయని.. తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినా వంద సీట్లు ఖాయమని చెప్పారు గోనె.