హైదరాబాద్లో ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు.. పోలింగ్ బూత్లో ఘర్షణ
బోగస్ ఓట్లు వేస్తున్నారని మహేష్ బ్యాంక్ ఛైర్మన్ రమేష్ జంగ్ వర్గంపై ఆరోపణలు చేశారు భగవతి దేవి
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 32వేల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే.. బోగస్ ఓట్లు వేస్తున్నారని మహేష్ బ్యాంక్ ఛైర్మన్ రమేష్ జంగ్ వర్గంపై ఆరోపణలు చేశారు భగవతి దేవి. దీంతో పోలింగ్ బూత్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. జాయింట్ సీపీ విశ్వప్రసాద్ పరిస్థితి సమీక్షిస్తున్నారు.