Etela Rajender : రైతుల అరెస్ట్‌ అన్యాయం.. తెలంగాణ తిరుగుబాటుకు టైమొచ్చిందన్న ఈటల

Update: 2024-11-13 10:00 GMT

లగిచెర్లలో రెతుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. రైతుల మీద అక్రమ కేసులు పెడితే మంచిది కాదని.. యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు.

ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు ఈటల రాజేందర్. బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదు ప్రజలు ఓట్లు వేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఈటల.

Tags:    

Similar News