ASSEMBLY: మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర... బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఛాన్స్.. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు పచ్చాజెండా

Update: 2025-09-01 03:00 GMT

ము­న్సి­ప­ల్‌, పం­చా­య­తీ­రా­జ్‌ చట్ట­స­వ­రణ బి­ల్లు­ల­ను తె­లం­గాణ శా­స­న­సభ ఏక­గ్రీ­వం­గా ఆమో­దిం­చిం­ది. దీం­తో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమలు చేసే అవ­కా­శ­ముం­ది. తొ­లుత ము­న్సి­ప­ల్‌, తర్వాత పం­చా­య­తీ­రా­జ్‌ చట్ట సవరణ బి­ల్లు­ల­ను సభలో ప్ర­వే­శ­పె­ట్టి చర్చిం­చా­రు. అనం­త­రం ఆ బి­ల్లు­ల­కు సభ ఆమో­దం తె­లి­పిం­ది. ప్రై­వే­ట్‌ మె­డి­క­ల్‌ కే­ర్‌ ఎస్టా­బ్లి­ష్‌­మెం­ట్స్‌ బి­ల్లు, ఇస్నా­పూ­ర్‌ ము­న్సి­పా­లి­టీ వి­స్త­రణ.. ఇం­ద్రే­శం, జి­న్నా­రం ము­న్సి­పా­లి­టీల ఏర్పా­టు బి­ల్లు­కు కూడా శా­స­న­సభ ఏక­గ్రీ­వం­గా ఆమో­దం తె­లి­పిం­ది. బి­ల్లు అమ­లు­కు సభ సభ్యు­లం­తా ఆమో­దం తె­లి­పా­రు. దీం­తో ము­న్సి­ప­ల్ చట్ట సవరణ బి­ల్లు­ను ఆమో­దిం­చి­న­ట్లు స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ సభలో ప్ర­క­టిం­చా­రు. ఇక సభలో రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై­నా వా­డీ­వే­డీ­గా చర్చ సా­గిం­ది. అధి­కార, ప్ర­తి­ప­క్ష సభ్యు­లు మా­ట్లా­డా­రు. సీఎం రే­వం­త్ రె­డ్డి­తో పాటు ప్ర­తి­ప­క్ష నేత కే­టీ­ఆ­ర్ సైతం చర్చిం­చా­రు. అం­త­కు­ముం­దు రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై చర్చిం­చేం­దు­కు అన్ని పా­ర్టీ­లు మద్ద­తు పలి­కా­యి. అనం­త­రం మం­త్రి సీ­త­క్క పం­చా­య­తీ­రా­జ్ చట్ట సవరణ బి­ల్లు­ను సభలో ప్ర­వే­శ­పె­ట్టా­రు. బీ­ఆ­ర్ఎ­స్ బీసీ రి­జ­ర్వే­ష­న్ బి­ల్లు­ల­కు మద్ద­తు తె­లు­పు­తుం­ద­ని కే­టీ­ఆ­ర్ అన్నా­రు. డి­క్ల­రే­ష­న్ ఇవ్వ­డా­ని­కి బదు­లు­గా డె­డి­కే­ష­న్ తో బి­ల్లు­ల­ను చట్టా­లు­గా మా­ర్చి చూ­పిం­చా­ల­ని హి­త­వు పలి­కా­రు. అం­త­కు­ముం­దు బి­ల్లు­ల­పై చర్చ సం­ద­ర్భం­గా మం­త్రు­లు మా­ట్లా­డా­రు. బీ­సీ­లు అం­చె­లం­చె­లు­గా ఎద­గా­ల­ని తమ ప్ర­భు­త్వం కో­రు­కుం­టోం­ద­ని మం­త్రి వా­కి­టి శ్రీ­హ­రి తె­లి­పా­రు.

బీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు

ము­న్సి­ప­ల్, పం­చా­య­తీ రాజ్ చట్ట సవరణ బి­ల్లు­ల­కు భారత రా­ష్ట్ర సమి­తి పూ­ర్తి మద్ద­తు తె­లి­పిం­ద­ని పా­ర్టీ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ తె­లి­పా­రు. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల­ను తమ పా­ర్టీ హర్షి­స్తుం­ద­ని చె­ప్పా­రు. శా­స­న­స­భ­లో మా­ట్లా­డు­తూ, ఈ బి­ల్లు­పై కేం­ద్ర ప్ర­భు­త్వం­తో అఖి­ల­ప­క్ష చర్చ­లు జర­పా­ల­ని, అం­దు­కో­సం ప్ర­ధా­న­మం­త్రి­తో సమా­వే­శా­ని­కి సమయం కే­టా­యిం­చా­ల­ని కో­రా­రు. ‘మేము కూడా ఢి­ల్లీ­కి వచ్చి ఈ బి­ల్లు­కు బల­మైన మద్ద­తు ఇస్తాం’ అని స్ప­ష్టం చే­శా­రు. గతం­లో కే­సీ­ఆ­ర్ ఢి­ల్లీ­కి వె­ళ్లి తె­లం­గాణ సా­ధిం­చి వచ్చి­న­ట్లే, ఇప్పు­డు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కూడా ఢి­ల్లీ­కి వె­ళ్లి బీసీ రి­జ­ర్వే­ష­న్ల కోసం పో­రా­డా­ల­ని సూ­చిం­చా­రు. అవ­స­ర­మై­తే జం­త­ర్ మం­త­ర్ వద్ద ని­ర­సన దీ­క్ష చే­యా­ల్సిన పరి­స్థి­తి వస్తుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. బీ­సీల హక్కుల కోసం పో­రా­డేం­దు­కు కాం­గ్రె­స్ పా­ర్టీ­కి ని­జ­మైన కమి­ట్మెం­ట్, ని­బ­ద్ధత అవ­స­ర­మ­ని కాం­గ్రె­స్‌ పో­రా­డి­తే తాము మద్ద­తు ఇస్తా­మ­ని కే­టీ­ఆ­ర్ అన్నా­రు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలుపుతూ.. కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Tags:    

Similar News