టీఆర్ఎస్ ప్రశాంతంగా ఉంటే.. సొంత పార్టీ నేతల విమర్శలతో ప్రతిపక్షాలు గందరగోళంలో ఉన్నాయన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీషోలా అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలవలేదన్న బాల్క సుమన్.. పక్క రాష్ట్రంలో దేనికి పనికిరాని వ్యక్తితో హైదరాబాద్లో రాజకీయాలు ఎంటో వాళ్లకే తెలియాలన్నారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ హుందాగా ఉండాలన్నారు.