Bandi Sanjay : ప్రజాసంగ్రామయాత్రతో కేసీఆర్లో వణుకు : బండి సంజయ్
Bandi Sanjay : తన ప్రజాసంగ్రామయాత్రతోనే KCRలో వణుకు మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay : తన ప్రజాసంగ్రామయాత్రతోనే KCRలో వణుకు మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అందుకే ఫాం హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారన్నారు. రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రారంభ ఉపన్యాసం చేసిన బండి సంజయ్... ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు తమదే అన్నారు. బీజేపీ రాష్ట్రకార్యవర్గం సమావేశంలో TRSను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే కీలకంగా చర్చిస్తున్నారు. ఇవాళ పలు తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు. సంస్థాగత పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉపన్యాసం ఉంటుంది.