Bandi Sanjay : ప్రగతి భవన్లో ఆ ఒక్కరికే అపాయింట్మెంట్.. మరెవరికీ ఉండదు : బండి సంజయ్
Bandi Sanjay : రాష్ట్రంలోని కొత్త సచివాలయానికి అంబేద్కర్ లేదా.. సర్ధార్ పటేల్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు
Bandi Sanjay : రాష్ట్రంలోని కొత్త సచివాలయానికి అంబేద్కర్ లేదా.. సర్ధార్ పటేల్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్లో అంబేద్కర్ ఫోటో ఎందుకు తీసేశారో చెప్పాలన్నారు. సీఎంకు దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని బండి సవాల్ విసిరారు. వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జీ బాధకల్గించిందన్నారు. ప్రగతి భవన్ ప్రజలకు కాదని.,., అది ఒక బార్గా మారిందని ఆరో్పించారు.
ఎమ్మెల్యేలకు,మంత్రులకు అందులోకి ప్రవేశం లేదన్నారు. ఓవైసీకి తప్ప ఎవరికి అపాయిట్మెంట్ ఉండదని మండిపడ్డారు. 8 ఏళ్లలో ప్రగతి భవన్కు ఎంతమంది ప్రజలు వచ్చారో లెక్కలు చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చలు లేకుండానే బిల్లులు పాస్ చేసుకోవడంపై బండి మండిపడ్డారు.