కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఎలుగుబంటి కలకలం రేపింది. సంగోజివాడి గ్రామ శివారులో సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్ర గాయాలైన అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అటు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు.