తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హెచ్సీయూ భూముల వేలం వేడయంపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.