REVANTH: రేవంత్రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ
విద్యా శాఖపై సీఎం రేవంత్ సమీక్ష;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్-2047ను ఆ లేఖలో ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైజింగ్ విజన్ 2047గురించి ఆయనకు వివరించారు. పెట్టుబడులు, ఐటీ, ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో లక్ష్యాల గురించి టోనీ బ్లెయిర్తో రేవంత్రెడ్డి చర్చించారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్, తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా.. రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఇరువైపుల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 తనను ఆకట్టుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన టోనీ బ్లెయిర్.. ఈ విజన్కు సహకరిస్తామని తెలిపారు. మరోవైపు పట్టణాల్లో, నగరాల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో శానిటేషన్, నీరు, డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ వహించాలన్నారు. రోడ్లపై నీరు నిలిచే చోట ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలని, పాఠశాలల్లో అవసరమైన మేర నూతన గదులు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ మెట్రో ప్రస్తావన లేదు: మంత్రి
కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ మెట్రో ప్రస్తావన లేదని మంత్రి శ్రీధర్బాబు అసహనం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, పూణె మెట్రోకు కేంద్రం సెకండ్ ఫేజ్ కేటాయించిందని తెలిపారు. కానీ తెలంగాణ మెట్రో విస్తరణపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని వెల్లడించారు. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనను కేంద్రం వెంటనే ఆమోదించాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని మంత్రి అన్నారు.