BRS: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

కష్టాలకు భయపడకూడదన్న కేసీఆర్‌... పల్లెలకు మంచి రోజులు వస్తాయి.. ప్రజలు అధైర్యపడొద్దని కేసీఆర్ సూచన

Update: 2025-12-06 04:00 GMT

బీ­ఆ­ర్ఎ­స్ పా­ల­న­లో గ్రా­మా­ల­న్నీ ఆర్థిక వ్య­వ­స్థ­లు­గా వర్ధి­ల్లా­య­ని మాజీ ము­ఖ్య­మం­త్రి కే చం­ద్ర­శే­ఖ­ర్ రావు అన్నా­రు. శు­క్ర­వా­రం గజ్వే­ల్ ని­యో­జ­క­వ­ర్గ పరి­ధి­లో­ని ఎర్ర­వె­ల్లి, నర్స­న్న­పేట గ్రా­మాల నూతన సర్పం­చు­లు, వా­ర్డు మెం­బ­ర్ల­ను కే­సీ­ఆ­ర్ తన ఫాం హౌ­స్‌­కు ఆహ్వా­నిం­చా­రు. గ్రా­మ­స్థుల మద్ద­తు­తో ఎన్ని­కైన సర్పం­చు­ల­ను శా­లు­వా­ల­తో సత్క­రిం­చి వా­రి­కి మి­ఠా­యి­లు పం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా తన వద్ద­కు వచ్చిన గ్రా­మ­స్థు­ల­ను గు­ర్తు­ప­ట్టి పేరు పే­రు­నా పల­క­రిం­చి, వారి యోగ క్షే­మా­ల­ను అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. గ్రా­మా­ల్లో వా­తా­వ­ర­ణం, మౌ­లిక వస­తుల అం­దు­బా­టు, పం­డు­తు­న్న పంటల పరి­స్థి­తి గు­రిం­చి పేరు పే­రు­నా అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. ‘‘మనకు అన్ని కా­లా­లు అను­కూ­లం­గా ఉం­డ­వు. కొ­న్ని సమ­యా­ల్లో కష్టా­లు వస్తా­యి. వా­టి­కి వె­ర­వ­కూ­డ­దు. మళ్లీ వచ్చే­ది భారత రా­ష్ట్ర సమి­తి ప్ర­భు­త్వ­మే. తె­లం­గాణ పల్లె­ల­కు తి­రి­గి మంచి రో­జు­లు వస్తా­యి. అప్ప­టి­దా­కా ప్ర­జ­లు ఎట్టి పరి­స్థి­తు­ల్లో అధై­ర్య­ప­డొ­ద్దు. గత భారత రా­ష్ట్ర సమి­తి ప్ర­భు­త్వం అం­దిం­చిన స్ఫూ­ర్తి.. స్వ­యం­శ­క్తి­తో పల్లె­ల­ను అభి­వృ­ద్ధి చే­సు­కుం­టూ ముం­దు­కు నడ­వా­లి’’ అని కే­సీ­ఆ­ర్‌ భరో­సా ఇచ్చా­రు. సా­ద­రం­గా ఆహ్వా­నిం­చి, శా­లు­వా­ల­తో సత్క­రిం­చిన కే­సీ­ఆ­ర్‌.. వా­రి­కి మి­ఠా­యి­లు పం­చా­రు. వారి యోగ క్షే­మా­లు, గ్రా­మా­ల్లో మౌ­లిక వస­తు­లు, పంటల పరి­స్థి­తి గు­రిం­చి అడి­గి తె­లు­సు­కు­న్నా­రు.

తొలి విడతలో ఎన్నికల జరగనున్న 4,236 సర్పంచ్‌ స్థానాల్లో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని 26 స్థానాలు ఉన్నాయి. ఈ 26 మందిలో 25 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు కాగా ఒకరు టీడీపీకి చెందిన వారు.

సమా­వే­శం­లో కే­సీ­ఆ­ర్‌ మా­ట్లా­డు­తూ.. ‘‘నూతన సర్పం­చు­లు గొ­ప్ప ఆలో­చ­న­ల­తో తమ గ్రా­మాల అభి­వృ­ద్ధి­కి ప్ర­ణా­ళి­క­లు రచిం­చు­కో­వా­లి. గం­గ­దే­వి­ప­ల్లి లాం­టి అభి­వృ­ద్ధి చెం­దిన గ్రా­మా­ల­ను ఆద­ర్శం­గా తీ­సు­కో­వా­లి. ప్ర­జల భా­గ­స్వా­మ్యం­తో కమి­టీ­లు వే­సు­కొ­ని పల్లె అభి­వృ­ద్ధి­కి పా­టు­ప­డా­లి. ఎవరో ఏదో చే­స్తా­ర­ని.. ఏదో ఇస్తా­ర­ని ఆశలు పె­ట్టు­కొ­ని ఆగం కా­వ­ద్దు. పదే­ళ్ల భారత రా­ష్ట్ర సమి­తి పా­ల­న­లో.. రా­ష్ట్రం­లో­ని గ్రా­మా­ల­న్నీ స్వ­యం సమృ­ద్ధి చెం­దా­యి’’ అని పే­ర్కొ­న్నా­రు. సమా­వే­శం­లో మాజీ ఎమ్మె­ల్సీ శేరి సు­భా­శ్‌­రె­డ్డి, నూ­త­నం­గా ఎన్ని­కైన ఎర్ర­వె­ల్లి సర్పం­చి నా­ర­న్న­గా­రి కవి­తా రా­మ్మో­హ­న్‌­రె­డ్డి దం­ప­తు­లు, ఆ గ్రామ ఉప సర్పం­చి ఎడ్మ సబి­తా కరు­ణా­క­ర్, నర్స­న్న­పేట గ్రామ సర్పం­చి గిలక బాల నర్స­య్య సహా గ్రా­మా­ల ప్ర­ము­ఖు­లు పా­ల్గొ­న్నా­రు.

Tags:    

Similar News