CBN: సాగు పద్ధతులకు సాంకేతికతను అద్దుతాం

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు... సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ ప్రారంభం.. 99 శాతం అకౌంట్లలో డబ్బులు వేశామన్న సీఎం

Update: 2026-03-14 03:00 GMT

ఏపీ­లో­ని రై­తు­ల­కు ఆర్థి­కం­గా బలం చే­కూ­ర్చేం­దు­కు ప్ర­భు­త్వం చే­ప­ట్టిన చర్య­ల్లో భా­గం­గా ‘అన్న­దాత సు­ఖీ­భవ’ పథకం ద్వా­రా ని­ధుల పం­పి­ణీ­ని ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు ప్రా­రం­భిం­చా­రు. కృ­ష్ణా జి­ల్లా గన్న­వ­రం ని­యో­జ­క­వ­ర్గం సూ­రం­ప­ల్లి­లో ని­ర్వ­హిం­చిన కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న ఆయన, రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా లక్ష­లా­ది మంది రై­తుల ఖా­తా­ల్లో ఇప్ప­టి­కే ఆర్థిక సహా­యం జమ చే­సి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. రై­తు­ల­కు నే­రు­గా ఆర్థిక మద్ద­తు అం­దిం­చ­డం ద్వా­రా వారి జీ­వ­నో­పా­ధి­ని బలో­పే­తం చే­య­డ­మే ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని ఈ సం­ద­ర్భం­గా చె­ప్పా­రు. రా­ష్ట్రం­లో­ని సు­మా­రు 48 లక్షల 85 వేల మంది రై­తుల బ్యాం­కు ఖా­తా­ల్లో అన్న­దాత సు­ఖీ­భవ పథకం కింద ని­ధు­లు జమ చే­శా­మ­ని సీఎం తె­లి­పా­రు. ఒక్కో రై­తు­కు రూ.6 వేల చొ­ప్పున ఈ విడత సాయం అం­దిం­చా­మ­ని, ఇప్ప­టి­కే దా­దా­పు 99 శాతం మంది రై­తుల ఖా­తా­ల్లో ఈ డబ్బు­లు చే­రా­య­ని వె­ల్ల­డిం­చా­రు. రై­తు­లు తమ ఖా­తా­ల­ను పరి­శీ­లిం­చి ని­ధు­లు జమ అయ్యా­యో లేదో చూ­సు­కో­వా­ల­ని కూడా సూ­చిం­చా­రు. రై­తు­ల­కు ప్ర­తి సం­వ­త్స­రం మొ­త్తం రూ.20 వేల ఆర్థిక సహా­యం అం­దే­లా ప్ర­భు­త్వం చర్య­లు తీ­సు­కుం­టోం­ద­ని ఆయన వి­వ­రిం­చా­రు. కేం­ద్ర ప్ర­భు­త్వం ఇచ్చే రూ.6 వేల సా­యా­ని­కి రా­ష్ట్ర ప్ర­భు­త్వం అద­నం­గా రూ.14 వే­లు­ను జో­డిం­చి రై­తు­ల­కు అం­ది­స్తు­న్న­ట్లు చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. రై­తుల సం­క్షే­మం కోసం అనేక కా­ర్య­క్ర­మా­లు అమలు చే­స్తు­న్నా­మ­ని, తాను కూడా రైతు కు­టుం­బం­లో పు­ట్టిన వ్య­క్తి­నే కా­బ­ట్టి రై­తుల కష్టా­లు తనకు బాగా తె­లు­స­ని అన్నా­రు. రైతు ఇబ్బం­దు­లు తగ్గిం­చేం­దు­కు సా­గు­నీ­టి అం­దు­బా­టు­పై ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టా­మ­ని తె­లి­పా­రు.

రై­తు­లు పం­డిం­చిన ధా­న్యా­న్ని ప్ర­భు­త్వం కొ­ను­గో­లు చే­సిన తర్వాత 24 గంటల వ్య­వ­ధి­లో­నే వారి ఖా­తా­ల్లో డబ్బు­లు జమ చేసే వి­ధా­నా­న్ని అమలు చే­స్తు­న్నా­మ­ని సీఎం వె­ల్ల­డిం­చా­రు. రై­తు­ల­కు ఎలాం­టి ఆర్థిక ఇబ్బం­దు­లు రా­కుం­డా చూ­డ­ట­మే ప్ర­భు­త్వ ప్ర­ధాన ఉద్దే­శ­మ­ని చె­ప్పా­రు. వ్య­వ­సాయ రం­గం­లో ఆధు­నిక సాం­కే­తి­కత వి­ని­యో­గా­న్ని కూడా ప్రో­త్స­హి­స్తు­న్నా­మ­ని, రై­తు­లు టె­క్నా­ల­జీ­ని వి­ని­యో­గిం­చు­కుం­టూ ముం­దు­కు సా­గు­తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు.

రా­ష్ట్రం­లో సా­గు­నీ­టి వన­రుల అభి­వృ­ద్ధి­కి ప్ర­భు­త్వం ప్ర­త్యేక ప్రా­ధా­న్యం ఇస్తోం­ద­ని చం­ద్ర­బా­బు చె­ప్పా­రు. పట్టి­సీమ ప్రా­జె­క్ట్ ద్వా­రా గో­దా­వ­రి నదీ జలా­ల­ను కృ­ష్ణా నది­తో అను­సం­ధా­నం చే­య­డం ద్వా­రా డె­ల్టా ప్రాం­తా­ల­కు నీటి సర­ఫ­రా మె­రు­గు­ప­డిం­ద­ని గు­ర్తు చే­శా­రు. చె­రు­వు­ల­ను పు­న­రు­ద్ధ­రిం­చి వా­టి­లో నీరు ని­ల్వ ఉం­డే­లా చర్య­లు తీ­సు­కు­న్నా­మ­ని తె­లి­పా­రు. ప్ర­భు­త్వం చే­ప­ట్టిన చర్యల వల్ల భూ­గ­ర్భ జలాల మట్టం కూడా పె­రి­గిం­ద­ని చె­ప్పా­రు. వ్య­వ­సాయ అభి­వృ­ద్ధి­తో పాటు గ్రా­మీణ ఆర్థిక వ్య­వ­స్థ­ను బలో­పే­తం చే­య­డా­ని­కి పలు కా­ర్య­క్ర­మా­లు చే­ప­డు­తు­న్నా­మ­ని సీఎం వి­వ­రిం­చా­రు. ఆక్వా కల్చ­ర్ రై­తు­ల­కు రా­యి­తీ కింద రూ.810 కో­ట్లు మం­జూ­రు చే­శా­మ­ని తె­లి­పా­రు. రై­తు­ల­కు అవ­స­ర­మైన వ్య­వ­సాయ పని­ము­ట్లు అం­దిం­చ­డ­మే కా­కుం­డా డి­జి­ట­ల్ క్రా­ప్ సర్వే ని­ర్వ­హి­స్తూ పంట వి­వ­రా­ల­ను నమో­దు చే­స్తు­న్నా­మ­న్నా­రు. కా­లు­వ­ల్లో పూ­డిక తొ­ల­గిం­చ­డం, డ్రె­యి­న్లు మర­మ్మ­తు చే­య­డం వంటి పను­లు కూడా చే­ప­ట్టా­ల­ని ఆదే­శా­లు ఇచ్చా­మ­న్నా­రు.

Tags:    

Similar News