TG : త్వరలో గులాబీ పార్టీ ఖాళీ.. దానం సంచలన వాఖ్యలు

Update: 2024-06-21 09:45 GMT

 తమ పార్టీలో చేరేందుకు చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ( Danam Nagender ) అన్నారు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైందని, త్వరలో 20మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరతారని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంప ముంచాయని, త్వరలో గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని దానం జోస్యం చెప్పారు.

హారీశ్ రావు పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కొత్త ప్రభాకర్, కేవీ వివేకానంద, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే హస్తం పార్టీలోకి వస్తారని దానం నాగేందర్ అన్నారు.

లోక్​సభ ఎన్నికల జరుగుతున్న సమయంలో కూడా ఎక్కువ మంది బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్​ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముగియగానే హస్తం పార్టీలోకి వచ్చేందుకు ఇతర పార్టీ నాయకులు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్​ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ప్రోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అప్పడు హస్తం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు నిజమవుతాయా అనే చర్చ ప్రజల్లో మొదలైంది.

Tags:    

Similar News