తనపై తప్పుడు ప్రచారానికి ఉత్తమే బాధ్యత వహించాలన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కాంగ్రెస్ ఖాళీ అయిందని జీర్ణించుకోలేక.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న చేతకాని దద్దమ్మ ఉత్తమ్ అని ఆమె మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్రెడ్డికి నాతో మాట్లాడేంత సీన్ లేదన్న డీకే అరుణ... తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.