TG : లక్ష్మీదేవి బొమ్మ ఉన్న పటాకులు కాల్చొద్దు.. రాజాసింగ్ పిలుపు

Update: 2024-10-31 12:15 GMT

పటాకులు కాల్చడంలో పద్ధతులు పాటించాలని కోరారు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్. లక్ష్మీ దేవిని కొలిచే దీపావళి రోజు అమ్మవారి బొమ్మతో ఉండే ఏ పటాకాను కాల్చవద్దన్నారు రాజాసింగ్. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీదేవి ఫోటోతో పటాకాలు కాల్చుతున్నారని, ఈసారి సంకల్పం తీసుకుని వాటిని కొనకుండా ఉండాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచైనా అలాంటి టపాకులు తయారు చేయకుండా ఉంటారన్నారు. ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు.

Tags:    

Similar News