Shadnagar Drugs Seized : షాద్ నగర్ లో రూ.3కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

Update: 2025-05-31 06:45 GMT

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్ నగర్ లో భారీగా హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ లోని రాయకల్ టోల్ గేట్ వద్ద ఓ దాబాలో రూ.3 కోట్ల విలువ హెరాయిన్, గంజాయిని స్వాధీనం చేసుకుని రాజస్థాన్ రాష్ట్రంలోని నాగూర్ కు చెందిన వికాస్ సాహును అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటంతో వారికోసం గాలింపు చర్యలు చేపడు. తున్నారు. దాబాలో గుట్టుగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న దాబాలో హెరాయిన్తో పాటు ఓపీఎం, పోపీ స్ట్రా, డ్రై గాంజాను స్వాధీనం చేసు కున్నట్లు సీపీ అవినిష్ మహంతి తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ షాద్ నగర్ సమీపంలోని రాయకల్లో మార్వాడి దాబా నిర్వహిస్తున్న వికాస్ సాహూ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. అందిందన్నారు. ఈ క్రమంలో వికాస్ సాహుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. గతంలో దాబా యజమాని సంజు భాయ్ కలిసి వికాస్ గంజాయి విక్రయించాడని, ఇటీవల అతడు మరణించడంతో దాబాను వికాస్ సాహు నిర్వహిస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పలువురికి నిందితుడు డ్రగ్స్ విక్రయించారని, అలాగే దాబాకు వచ్చే వారికి కూడా డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు.

Tags:    

Similar News