TG : 108 మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ అంబులెన్స్ లు : భట్టి విక్రమార్క

Update: 2025-06-19 10:45 GMT

2029-30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 108 మాదిరిగా విద్యుత్ శాఖలో 1912 సేవలను ప్రారంభించామన్నా రు. ఈ అంబులెన్స్ సేవలను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇవాళ ఖమ్మం లో ఎలక్ట్రికల్ అంబులెన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా విద్యుత్ సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు రాష్ట్ర ఉత్త్మ య్యుత్ పంపిణి తెగించి అప్పటికప్పుడు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అప్పుడే వారి శ్రమను తాను కళ్లారా చేశానని అన్నారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటామని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కి ఒక్కొక్కరికి రూ. కోటి బీమా చేయించామని తెలిపారు. దేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలోనూ, ఈ తరహా పథకం అమలులో లేదు అన్నారు. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు. ముందుచూపుతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయ గలిగేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అదనంగా ఒక్క విద్యుత్ ఉత్పత్తి కోసం ఏ పరిశ్రమను నెలకొల్పిన దాఖలాలు లేవు. పదేండ్లు ఎనర్జీ పాలసీ లేక గందరగోళ పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక రూ. లక్ష కోట్లతో పంప్డ్ స్టోరేజీ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశాం. ప్రజా ప్రభుత్వంలో న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ - 2025 తీసుకువచ్చాం. లక్ష కోట్ల విలువైన ఉత్పత్తి ఒప్పందాలు చేస్తున్నం. 'అని డిప్యూటీ సీఎం అన్నారు.

Tags:    

Similar News