Erragadda Incident : ఎర్రగడ్డ ఘటన : డైట్ కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిపై కేసు

Update: 2025-06-05 13:15 GMT

ఎర్రగడ్డ మానసిన ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫుడ్ పాయిజన్ ఒక రోగి మృతి చెందగా.. సుమారు 71 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాధ్యులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. నిన్న ఘటనాస్థలిని మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ ఘటనకు కారణమైన ఉన్నతాధికారు లతో పాటు డైట్ కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఆర్ఎంవో డాక్టర్ డి.పద్మజ ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం ఆమె స్థానంలో ఉస్మానియా జనరల్ హాస్పి టల్ డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ బి.శంకర్ మానసిక వైద్యశాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్ర మంలోనే ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి డైట్ కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆ ఫిర్యాదును స్వీక రించిన పోలీసులు ఫుడ్ పాయిజన్ ఘటనకు కలుషితమైన ఆహారమే కారణం అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News