స్కూల్లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన స్కూల్ ఆఫీసు రూం
హైదరాబాద్ గౌలిపురాలోని శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో స్కూలు ఆఫీసు రూం పూర్తిగా దగ్ధమైంది.;
హైదరాబాద్ గౌలిపురాలోని శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో స్కూలు ఆఫీసు రూం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మంటలను చూసి భయంతో పరుగులు తీశారు. కొందరైతే ఆ స్కూల్ రెండో అంతస్తు నుంచి పక్క భవనంపైకి దూకారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలను అదుపు చేశారు. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అంచనా వేస్తున్నారు.